బొమ్మరిల్లు సినిమా కథ ఆ పుస్తకం నుంచి తీసుకున్నారా?

2006లో మంచి ప్రేమ కథ నేపథ్యంతో విడుదలైన సినిమా బొమ్మరిల్లు.ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాతో డైరెక్టర్ భాస్కర్ కు మంచి గుర్తింపు రావడంతో బొమ్మరిల్లు భాస్కర్ గా పేరు సంపాదించుకున్నాడు.

దిల్ రాజ్ నిర్వహణలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధార్థ్, జెనీలియా నటీనటులుగా నటించారు.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ సినిమా కథ, పాటలు, పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాకు కథను డైరెక్టర్ ఓ పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాకు తొలిసారిగా తన దర్శకత్వంను పరిచయం చేశాడు భాస్కర్.

కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.ఇక బొమ్మరిల్లు సినిమాతో ఉత్తమ నూతన దర్శకుడు గా అవార్డు కూడా అందుకున్నాడు.

ఇక ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న తర్వాత అప్పట్లో ఈ సినిమా గురించి ఒక కాంట్రవర్సీ బాగా నడిచింది.

ఈ సినిమాకు కథను ఒక కథ పుస్తకం నుండి తీసుకున్నట్లు తెలిసింది.అది కూడా 'ఆమెలో ఏముంది' అనే బుక్ నుంచి డైరెక్టర్ భాస్కర్ ఈ సినిమా కథను రూపొందించినట్లు తెలిసింది.

"""/"/ దీంతో ఈ కథను రాసిన రైటర్ కూడా ఈ సినిమాపై కేసు వేసినట్లు గతంలో బాగా వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత మళ్లీ ఈ విషయం గురించి ఎవరు మాట్లాడుకోకపోగా తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బొమ్మరిల్లు కథ గురించి హాట్ టాపిక్ గా మారింది.

ఇక బొమ్మరిల్లు సినిమా తర్వాత పరుగు సినిమాకు దర్శకత్వం వహించి ఈ సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఆ తర్వాత వరుసగా ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు దర్శకత్వం వహించాడు.గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందగా తాజాగా ఈ సినిమా విడుదలైంది.

కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోగా కొంతవరకు మెప్పించిందని తెలుస్తుంది.ఇందులో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే నటీనటులుగా నటించారు.

"""/"/ ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కథ కాస్త ఆకట్టుకునే విధంగా లేదని ఎలా ప్రారంభం అయ్యిందో ఎలా ముగిసిందో అర్థం కాలేదని చాలామంది కామెంట్లలో తెలిపారు.

దీంతో తాజాగా ఈ సినిమా గురించి కూడా పలురకాల ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.

కొంతవరకు ఈ సినిమా కథ బొమ్మరిల్లు సినిమా కు సింక్ అయ్యేలా ఉందని టాక్ కూడా వచ్చింది.

నిజానికి ఈ సినిమా చాలా కన్ఫ్యూజన్ గా ఉందని పాత పద్ధతిలోనే ఈ సినిమాను రూపొందించాడని తెలిసింది.

ఈ సినిమాలో కొత్తదనం కనిపించలేదు అంటూ తీసిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ ఉన్నట్లు అనిపించాయి అని నెటిజన్లు అంటున్నారు.

Purandeswari : ఏపీలో కూటమి గెలుపు చారిత్రక అవసరం..: పురంధేశ్వరి