మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధర్మాన ప్రసాదరావు

రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు.సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని.తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవన్నారు.

సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు.సీనియర్ అధికారుల సమన్వయంతో పని చేస్తామని తెలిపారు.

రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ.అందరితో కలిసి టీమ్ వర్క్ చేయటం నాకు అలవాటు.

రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి.దీనివల్ల ఎకనమికల్ గ్రోత్‌కు భూమి ఉపయోగపడటం లేదు.

ఎక్కువ ల్యాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది.సీఎం జగన్‌ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారు.

పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామినల్ ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

చిరంజీవి కొత్త సినిమాలో నటించనున్న యంగ్ హీరో…డైరెక్టర్ ఎవరంటే..?