ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ధర్మ సమాజ్ పార్టీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో ఈ సందర్భంగా మాట్లాడుతూ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ 93% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీలో నిలుస్తున్నదని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ మీడియాతో తెలిపారు! నిరుపేద సామాన్య కుటుంబాల్లో నుంచి వచ్చిన వ్యక్తులను ఈ ఎన్నికల యుద్ధబరిలో ధర్మ సమాజ్ పార్టీ తరఫున అగ్రకుల రాజకీయాలను ఢీకొట్టడానికి అణగారిన కులాల అభ్యర్థిని సిరిసిల్ల నియోజకవర్గం నుండి కేసుగాని పరమేశ్వరి గారిని బరిలో నిలుపుతున్నామని ప్రకటించారు! నియోజకవర్గం లోని ప్రజలంతా ఆలోచించి ఓటుని అమ్ముకోకుండా ఆత్మగౌరవంతో ఆలోచించి గెలిపించాలని కోరారు! ఈ కార్యక్రమంలో పోటీలో నిలుస్తున్న అభ్యర్థి కేసు గాని పరమేశ్వరి ,డీఎస్ పి జిల్లా కమిటీ నాయకులు ఉల్లేoదుల అరుణ్ మహారాజ్, ముస్తాబాద్ మండల బాధ్యులు జిల్లెల్ల మహేష్ మహారాజ్, ఆంజనేయులు మహారాజ్ , భాస్కర్ మహారాజ్, కరుణాకర్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

సురేష్ ప్రొడక్షన్ మూవీలను రిలీజ్‌కి ఒక రోజు ముందే థియేటర్లలో వేస్తారట..??