పూజా విధానంలో దర్భల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాలలో చేసేటటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా దర్భలు తప్పనిసరిగా వాడుతారు.అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ దర్భలను యాగాలు, హోమాలు, దేవతా ప్రతిష్టలకు, పిండ ప్రదానం చేసేటప్పుడు ఈ దర్భ లను వాడుతూ ఉంటారు.

ఈ దర్భలను వాడడానికి గల కారణం ఏమిటి? వాడటం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ దర్భల నే కొందరు గరిక అని కూడా పిలుస్తూ ఉంటారు.ఇది ఒక రకమైన గడ్డి జాతికి చెందిన మొక్క దాదాపు రెండు అడుగుల పొడవు ఉంటుంది.

ఈ దర్భలు శ్రీరాముని స్పర్శకు నోచుకోని అంత పవిత్రమైనవిగా ఆ దర్భలను ప్రతి పూజా కార్యక్రమానికి వాడుతున్నారు.

ఈ దర్భలకు అధిక ఉష్ణ శక్తిని కలిగి ఉంటుంది.ఈ దర్భలను నీటిలో వేయడం వల్ల ఆ నీటిని శుభ్రపరుస్తుంది.

గ్రహణ సమయాలలో ఈ దర్భలను ప్రతి ఒక్క ఆహారపదార్థాలలో వేయడం గమనించే ఉంటాం.

అలా వేయడం వల్ల సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావం ఆహార పదార్థాలపై పడకుండా ఈ దర్బలు ఉపయోగపడతాయి.

హోమం, యాగం, దేవతారాధన చేసేటప్పుడు ఈ దర్భలను ఉంగరం గా చేసే మన కుడి చేతి ఉంగరపు వేలికి తొడుగుతారు.

ఆ వేలికి కఫనాడీఉండడంవల్ల, ఈ ఉంగరం ధారణ వల్ల కఫం శుభ్రపడుతుంది.ఏదైనా శుభకార్యం నిర్వహించేటప్పుడు రెండు దర్భలతో చేసిన ఉంగరాన్ని తొడుగుతారు.

పితృకార్యాలు చేసేటప్పుడు మూడు దర్బలు, దేవ కార్యాలలో నాలుగు దర్బలు, గల ఉంగరాన్ని ముడివేస్తారు.

ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ దర్బలలో దర్భ అడుగుభాగాన సాక్షాత్తు ఆ బ్రహ్మ కొలువై ఉంటాడని, మధ్యభాగంలో విష్ణుమూర్తి, దర్భ శిఖరాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటారని ప్రతితీ.

అమావాస్య రోజు కోసిన దర్భలను ఒక నెల పాటు ఉపయోగించవచ్చు.పౌర్ణమి సమయంలో కోసిన దర్భలను పదిహేను రోజులపాటు, ఆదివారం రోజున కోసిన దర్భలను ఒక వారం పాటు ఉపయోగించవచ్చు.

ఈ దర్భలను ప్రథమ పూజ్యుడైన ఆ వినాయకుడి కి ఎంతో ప్రీతికరమైనది.దేవుని యందు ఈ దర్భలను సమర్పించి పూజించడం వల్ల మనం చేసే ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుందని వేద పండితులు చెబుతుంటారు.

నేటి షెడ్యూల్ :   రాయలసీమలో షర్మిల.. గోదావరి జిల్లాలో జగన్