యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని( Yadadri Bhuvanagiri District ) ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ( Sri Lakshmi Narasimha Swamy ) దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

దీంతో స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా ఉన్నాయి.

మరోవైపు కొండపై ఉన్న పెయిడ్ పార్కింగ్ కార్లతో నిండిపోయింది.ఈ నేపథ్యంలో కొండపైకి పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారులు వాహనాలకు అనుమతిని ఇస్తున్నారు.

అలాగే భక్తులకు( Devotees ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

కాల్వలో పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.. వీడియో వైరల్