వేములవాడ రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రానికి భక్తులు బారులు తీరారు.
శ్రావణమాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
దీంతో రాజన్న దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుండగా.స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు మూడు గంటల సమయం పడుతోంది.
ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
చాలా ఏళ్ల గ్యాప్ తీసుకుని తిరిగి కలిసి నటించిన హీరో హీరోయిన్స్ వీరే !