యాదాద్రిలో భక్తుడు మృతి

యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్ట గండి చెరువులో భక్తుడు స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గల్లంతై భక్తుడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

యాదాద్రి కొండకు దిగువన ఉన్న గండి చెరువులో అల్వాల్ కు చెందిన టి.

భువనేశ్వర్ (19) అనే భక్తుడు స్నానం చేయడానికి వచ్చి ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతై మృతి చెందాడు.

కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు యాదాద్రి తులసి కాటేజ్ లోని గది తీసుకొని బస చేశారు.

మంగళవారం ఉదయం పుణ్య స్నానం చేయడానికి లక్ష్మీ పుష్కరణ వద్దకు వచ్చారు.పుష్కరిణిలో మరమ్మతులు జరుగుతుండడంతో పుష్కరణిని వారంరోజుల పాటు ఆలయ అధికారులు మూసివేశారు.

పుష్కరిణిలో అనుమతి లేకపోవడంతో పక్కనే ఉన్న గండి చెరువులో స్నానం చేయడానికి తండ్రితో పాటు ఇద్దరు అన్నదమ్ములు దిగారు.

ఈ క్రమంలో భువనేశ్వర్ అతని తండ్రి తులసి కమల్ శేఖర్,తమ్ముడు మల్లికార్జునులు ముగ్గురు ప్రమాదవశాత్తు జారారు.

ఈ సమయంలో భువనేశ్వర్ గండిచెరువులో గల్లంతయ్యారు.గల్లంతయిన విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.

చెరువులో రెండు గంటలపాటు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఫొటో వైరల్: శుభవార్త చెప్పేసిన జబర్దస్త్ కమెడియన్.. ‘అమ్మానాన్నలు కాబోతున్నాం’ అంటూ..