పుష్ప అప్‌డేట్‌ : దేవిశ్రీ పూర్తి చేశాడట

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే.

ఈమద్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్‌ జోరు కాస్త తగ్గిందనే వాదన వినిపిస్తుంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా థమన్‌ గురించి ప్రచారం జరుగుతోంది.

థమన్‌ కోసం స్టార్‌ హీరోలు వెయిట్‌ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో థమన్‌ కాకుండా పుష్ప చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంపిక చేయడం పట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌, సుకుమార్‌ల కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కనుక ఈ చిత్రంపై అంచనాలు కొందరు పెట్టుకున్నారు.వారి అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఖచ్చితంగా అద్బుతమైన సంగీతాన్ని ఇవ్వాలని దేవిశ్రీ ప్రసాద్‌ కష్టపడ్డాడట.

ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ పుష్ప చిత్రం కోసం ట్యూన్స్‌ అన్ని సిద్దం చేశాడట.

దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్‌ చేసిన ఏడు ట్యూన్స్‌ కూడా సుకుమార్‌ ఇంకా అల్లు అర్జున్‌లకు తెగ నచ్చాయట.

"""/"/ ఐటెం సాంగ్‌ కోసం రెండు ట్యూన్స్‌ను రెడీ చేశాడని, వాటిల్లో ఒక్కటి ఎంపిక చేసుకునే అవకాశం ఉందట.

మొత్తానికి పుష్ప చిత్రం షూటింగ్‌ ఇంకా ప్రారంభించకుండానే అప్పుడే దేవిశ్రీ పని పూర్తి చేయడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

కొందరు మాత్రం అంత హడావుడిగా చేశాడా అంటూ ప్రశ్నిస్తున్నారు.దేవిశ్రీ సంగీతం పుఫ్పకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో కాలమే నిర్ణయించాలి.

వర్షాకాలంలో బీరకాయ తింటున్నారా.. లేకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!