ఇంద్రప్రస్థం చూపిస్తోన్న ప్రస్థానం దర్శకుడు

బాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రస్థానం చిత్రంతో యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవా కట్టా, తొలుత టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే.

ప్రస్థానం చిత్రాన్ని తొలుత తెలుగులో తెరకెక్కించి అదిరిపోయే గుర్తింపును సాధించిన ఈ డైరెక్టర్ ఆ తరువాత చెప్పుకోదగ్గ హిట్ అందుకోలేకపోయాడు.

అయితే తాజాగా దేవా కట్టా టాలీవుడ్‌లో ఓ వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న స్నేహం-వైరానికి సంబంధించిన అంశాలతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.

కాగా ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు ఈ దర్శకుడు.ఈ సినిమాకు ‘ఇంద్రప్రస్థం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఈ టైటిల్ చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.ఇద్దరు నాయకులకు సంబంధించిన షేడ్స్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

కాగా ఈ సినిమాను దేవా కట్టా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నట్లు చిత్ర వర్గాల టాక్.

ఇక ఈ సినిమాను మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో తెరకెక్కిస్తున్న సినిమా తరువాత ప్రారంభించేందుకు దేవా కట్టా రెడీ అవుతున్నాడు.

మర ఈ సినిమా ఎలాంటి వివాదాలను, ఫలితాన్ని సాధిస్తుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తెలుగోళ్ల దెబ్బకు బాలీవుడ్ మాఫియా ప్యాంటు తడిసిపోతోంది?