చలికాలంలో రైల్వే ట్రాక్లపై డిటోనేటర్లు... ఎందుకు పెడతారంటే..
TeluguStop.com
వింటర్ సీజన్లో రైల్వే ట్రాక్పై ఎక్కడో ఒకచోట బటన్ లాంటిది ఉండటాన్ని మీరు చూసే ఉంటారు.
దీనినే 'డిటోనేటర్' అని అంటారు.డిటోనేటర్లు ఒక రకమైన పేలుడు పదార్థాలు.
వాటిని రైళ్ల రాకపోకల్లో పట్టాలపై వినియోగిస్తారు.పట్టాలమీద అమర్చిన డిటోనేటర్ మీదుగా రైలు వెళ్ళిన వెంటనే అది పెద్ద శబ్దం చేస్తుంది.
ఒక విధంగా చూస్తే అది పేలుడులాంటిదే.కానీ శబ్దం మాత్రమే వస్తుంది.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.రైల్వేశాఖ ఈ పేలుడు పదార్థాలను ఎందుకు ఉపయోగిస్తుంది? దాని వల్ల రైలుకు ఎటువంటి నష్టం జరగదా? అనే ప్రశ్నలు మదిలో తలెత్తుతాయి.
రైల్వేలు.ప్రయాణికుల భద్రత కోసం దీనిని ఉపయోగిస్తాయి.
ప్రమాదాలు లేదా పొగమంచు మొదలైన వాటిని నివారించడానికి వీటిని ఉపయోగిస్తార.రైల్వే ట్రాక్లో లోపం ఉన్నట్లు రైల్వే సిబ్బంది తెలుసుకున్నప్పుడు.
రైలును ఆపాల్సిన అవసరం రాగానే, డిటోనేటర్ని ఉపయోగించి, తప్పుగా ఉన్న ట్రాక్కు కొన్ని మీటర్ల ముందు దాన్ని అమరుస్తారు.
ఈ డిటోనేటర్లు గనులలో మాదిరిగా పనిచేస్తాయి.రైలు చక్రం దాని మీదుగా వెళుతున్న వెంటనే మందుపాతర పేలుడు వంటి శబ్దం వస్తుంది.
ఈ శబ్ధం విన్న రైలు డ్రైవర్ ముందు ప్రమాదం ఉందని అర్థం చేసుకుని రైలుకు బ్రేకులు వేస్తాడు.
"""/"/
ఈ పరిస్థితిలో రెండు-మూడు డిటోనేటర్లు ఒకదాని తర్వాత మరొకటి అమరుస్తారు.వీటి కారణంగా లోకో పైలట్ ముందుగానే అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గిస్తాడు.
ఈ విధంగా అధ్వాన్నమైన ట్రాక్ రాకముందే రైలు ఆగిపోతుంది.సాధారణంగా ఇది 600 మీటర్లకు ముందుగానే అమరుస్తారు.
అధిక పొగమంచు ఉన్నప్పుడు కూడా దీనిని ఉపయోగిస్తారు.ఎందుకంటే దట్టమైన పొగమంచులో, లోకోపైలట్కు బోర్డు మొదలైన వాటిని చూడడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
అటువంటి పరిస్థితిలో స్టేషన్ వచ్చినప్పుడల్లా ఈ డిటోనేటర్లను ముందుగా అమరుస్తారు.
సైఫ్ అలీ ఖాన్ ను పొడిచింది అతనే.. ఆ టెక్నాలజీతో అన్ని తేలిపోయాయిగా!