వృద్ధులకు ఆసరా లేకుండా పోయిన పెన్షన్

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో మూడు నెలలుగా వేలి ముద్రలు పడక ఆసరా పెన్షన్స్ రావడం లేదని,దీనితో వృద్ధులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ,ఉపాధిహామీ పథకం ద్వారా వచ్చే డబ్బులు కూడా పోస్ట్ ఆఫీస్ లో పడడం లేదని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు కారణం ఏమిటో తెలుసుకొని,వారికి ఆసరా పెన్షన్స్ వచ్చే విధంగా చూడాలని కోరుతూ చేసిన ఆ వీడియో సారాంశం.

కుటుంబంలో చిచ్చుపెట్టారు.. జనసేన నేతలపై ముద్రగడ ఫైర్..!!