రాజన్న గోశాల లోని కోడెలకు మెగా మెడికల్ క్యాంపును నిర్వహించిన పశుసంవర్ధక శాఖ

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రి ప్రగడ హనుమంతరావు ఐఏఎస్ ఆదేశాల మేరకు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సూచనల మేరకు గురువారం రాజన్న ఆలయ తిప్పాపురంలోని గోశాలలో నున్న కోడెలను మెగా క్యాంపు ద్వారా డాక్టర్ ప్రశాంత్ రెడ్డి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 20 మంది డాక్టర్లు,10 మంది సిబ్బంది 1500 కోడెలకు ఆరోగ్య తనిఖీలు చేసి అనారోగ్య సమస్యలున్న కోడెలకు వ్యాక్సిన్లు మందులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ప్రతాప నవీన్, పర్యవేక్షకులు నాగుల మహేష్ ఉన్నారు.

నాకోసం ప్రణతి ప్రతిరోజు కాంప్రమైజ్ అవుతుంది.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!