బిసి డిక్లరేషన్ చైర్మన్ గా పొన్నం నియామకం పట్ల హర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా: సార్వత్రిక ఎన్నికలలో బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఏర్పాటుచేసిన బిసి డిక్లరేషన్ చైర్మన్ గా పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) ను నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను కరీంనగర్ లో గురువారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ సన్మానించింది.

ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండల కాంగ్రెస్ కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ ఆధ్వర్యంలో ఈ సన్మాన ఈ సన్మానాన్ని చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, మండల బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్ ,నాయకులు దొమ్మాటి నరసయ్య, సూడిద రాజేందర్ కలిశారు.

ఈ సినిమా మాకు సెట్ కాదు..దర్శకుల ముఖం పైన చెప్పేసిన స్టార్ హీరోలు..?