భల్స్వా డెయిరీలో ఢిల్లీ స్పెషల్ పోలీసుల దాడి

ఢిల్లీలోని భల్స్వా డెయిరీలో ఢిల్లీ స్పెషల్ పోలీసులు దాడులు నిర్వహించారు.జహంగీర్ పురిలో యూఏపీఏ కింద అరెస్ట్ అయిన నౌషాద్, జగ్జీత్ సింగ్ లను విచారించిన అనంతరం డెయిరీలో సోదాలు చేపట్టారు.

ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో నిర్వహించిన ఈ తనిఖీలలో భల్స్వా డెయిరీ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్పెషల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం డెయిరీకి చేరుకున్న ఎఫ్ఎస్ఎల్ బృందం కొన్ని రక్త నమూనాలను సేకరించింది.నౌషాద్, జగ్జీత్ల హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అంతేకాకుండా హత్యకు సంబంధించిన వీడియోను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఎవరు హత్య చేయబడ్డారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

అన్నం గంజిలో ఇవి కలిపి జుట్టుకు రాస్తే మీ హెయిర్ డబుల్ అవుతుంది..!