రెజ్లర్ల నిరసనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్ధతు

ఢిల్లీలో రెజ్లర్లు కొనసాగిస్తున్న నిరసనకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు తెలిపారు.కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో రెజ్లర్లు గత వారం రోజులుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగుతోంది.

కాగా మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ప్రకటించగా.తాజాగా ఢిల్లీ సీఎం మద్దతు తెలిపారు.

కోర్టులో హాజరు కావడానికి మేకప్‌ డిమాండ్ చేసిన లేడీ మర్డరర్‌..?