సీఎం అభ్యర్థి విషయంలో పంజాబ్ ప్రజలకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్..!!

పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇటీవల పార్టీలో అంతర్గత విభేదాలు వల్ల.

గ్రూపు రాజకీయాలు ఏర్పడటంతో.కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాల్ లోకి వెళ్లి పోయింది.

కాగా మరికొద్ది నెలల్లో పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితం నీ చిన్నంగా పరిశీలించిన కేజ్రీవాల్ దాదాపు ఏడాదికి పైగా ఆమ్ ఆద్మీ పార్టీ క్యాలెండర్ ని పంజాబ్ రాష్ట్రంలో దింపి.

తిరుగులేని చక్రం తిప్పుతూ ఉన్నారు.ఈ తరుణంలో తాజాగా.

పంజాబ్ రాష్ట్ర ప్రజలకు సీఎం కేజ్రీవాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.విషయంలోకి వెళితే పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో.

మీరే తేల్చుకోవాలి అని 'జనతా చునేగి ఆప్నా సీఎం’ పేరుతో ఆప్ సర్వే నిర్వహించగా 24 గంటల్లో 8 లక్షల మంది స్పందించారు.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత హర్పల్ సింగ్ చిమా.వివరాలు వెల్లడించారు.

దీంతో ప్రకటన చేసినా 24గంటలోనే వాట్సాప్ ద్వారా మూడు లక్షల మంది.నాలుగు లక్షల మంది ఫోన్ కాల్స్.

50 వేలకు పైగా మెసేజ్ల ద్వారా.ఇంకా ఒక లక్షకు పైగా వాయిస్ మెసేజ్ ల రూపంలో.

పంజాబీ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తెలియజేయడంతో జనవరి 17 సాయంత్రం 5 గంటలకు.

ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం అభ్యర్థిని ప్రజలకు ఎంపిక చేసుకునే విధానాన్ని.

కేజ్రీవాల్ తీసుకురావటం సంచలనంగా మారింది.

Telangana Congress : తెలంగాణలో పెండింగ్‎లో ఉన్న 8 ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు..!