చిరంజీవి, త్రిషపై పరువునష్టం దావా .. మన్సూర్ వివాదంలో కొత్త మలుపు

సినీ నటి త్రిష, మన్సూర్ అలీఖాన్ వివాదం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో మన్సూర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.

ఈ క్రమంలోనే త్రిషకు మెగాస్టార్ చిరంజీవి, కుష్బూ వంటి నటీనటులు మద్ధతు పలికారు.

తరువాత మన్సూర్ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.కానీ తాజాగా ఈ వ్యవహారంలో కొత్త మలుపు చోటు చేసుకుంది.

తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా వక్రీకరించారని మన్సూర్ అలీఖాన్ చెబుతున్నారని తెలుస్తోంది.తన మాటలను ఎడిట్ చేసి తాను అసభ్యంగా మాట్లాడినట్లు చూపించారన్న ఆయన త్రిష, చిరంజీవితో పాటు కుష్బూ మాటలు తనను మానసికంగా బాధించాయని పేర్కొన్నారు.

ఈ క్రమంలో వారిపై తాను పరువునష్టం దావా వేస్తున్నట్లు వెల్లడించారని సమాచారం.

ఒకేసారి 14,000 మంది జాతీయ గీతం పాడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా..