ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది.ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు.

రిఖినికల్-బీరోఖల్ రహదారిపై 50 మందితో వెళ్తున్న పెళ్లి బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతులో ఉన్న నదిలో పడిన విషయం తెలిసిందే.

స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.ఇప్పటివరకు 25 మంది మృతదేహాలను వెలికి తీశారు.

మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట