నాంపల్లి అగ్నిప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవదహనం అయ్యారు.అదేవిధంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు మంటల్లో చిక్కుకున్న అపార్ట్ మెంట్ వాసుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ .. ఏ ఏ అంశాలపై చర్చించారంటే ?