దొంగనోట్ల గాదరి కిషోర్ నాలుక జాగ్రత్త:డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్

సూర్యాపేట జిల్లా:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగనోట్ల గాదరి కిషోర్ నాలుక అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

టీస్పీఎస్స ప్రశ్నాపత్రాలు లీకై నిరుద్యోగులు అల్లాడుతుంటే స్పందించే దమ్ములేని ఎమ్మెల్యే గాదరి కిషోర్,ప్రజల తరఫున కొట్లాడుతున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నవా అంటూ మండిపడ్డారు.

నీ ఇసుక దందాలు,కాంట్రాక్టుల కమిషన్ దందాలు,మీ పార్టీ లిక్కర్ స్కాంలను తెలంగాణ సమాజం గమనిస్తుందని,త్వరలో నీకు తుంగతుర్తి ప్రజలు సున్నం బొట్లు పెట్టి ఊరేగించడం ఖాయమని అన్నారు.

వర్షాకాలంలో దుస్తుల నుంచి చెడు వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ను తప్పక పాటించండి!