ఎంగేజ్మెంట్ ముందురోజు పెళ్ళికి నో చెప్పిన కూతురు.. తల్లిదండ్రులు ఏం చేసారంటే ?

ఇప్పటి యువత క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.

తీసుకున్న నిర్ణయాలు మళ్ళి ఎప్పుడు కాదంటారో కూడా వారికీ తెలియదు.చిన్న విషయానికి కూడా అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోవడం, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం వంటివి చేస్తున్నారు.

తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.ఎంగేజ్మెంట్ కు సరిగ్గా ఒక్కరోజు ముందు ఒక యువతి పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అంతేకాదు ఆ యువతి ఇంట్లో నుండి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఆవేశంలో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కర్ణాటకలోని హాసన్ జిల్లా ఆలూరుకు చెందిన పుట్టరాజు, భార్య కాంతమ్మ దంపతులకు పిల్లలు లేరు.

అందుకే వారు బంధువుల పిల్లల్లో ఒక బాలుడు, ఒక బాలికను దత్తత తీసుకుని పెంచుకున్నారు.

ఎంతో అల్లారుముద్దుగా పిల్లలను పెంచుకున్నారు.ఈ మధ్యే కుమారుడికి పెళ్లి చేసారు.

కుమార్తెకు కూడా పెళ్లి చేయాలనీ నిర్ణయించుకుని పెళ్లి సంభందం కుదుర్చుకున్నారు.ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసారు.

కానీ ఏమైందో తెలియదు.ఎంగేజ్మెంట్ ముందురోజు ఆ యువతి తనకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పింది.

అంతేకాదు ఆ రోజు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.ఇంట్లో వారు ఎలాగోలా ఆమెను వెతికి ఇంటికి తీసుకువచ్చారు.

ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగారు.కానీ ఆ యువతీ నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతే అని బెదిరించింది.

ఈ విషయం గురించి అలోచించి తీవ్ర మనస్తాపానికి గురి అయ్యి ఆవేశంలో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.

అర్ధరాత్రి ఇంట్లో వారంతా నిద్ర పోయిన తర్వాత పుట్టరాజు, కాంతమ్మ పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి వెళ్లి అక్కడ ఉరి వేసుకున్నారు.

అయితే వారిని ఎవరూ చూడక పోవడంతో ఇద్దరూ ప్రాణాలు విడిచారు.తెల్లవారక చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

‘ పిన్నెల్లి ‘ కి జగన్ మద్దతు … ఈసీకి టీడీపీ ఫిర్యాదు ?