రేపు ఏపీ అసెంబ్లీ ముందుకు డేటా చౌర్యం కమిటీ నివేదిక

రేపటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డేటా చౌర్యం కమిటీ నివేదికను ప్రవేశపెట్టబోతుంది.అసెంబ్లీ లైబ్రరీ హాల్లో కమిటీ సమావేశమైంది.

ఈ సమావేశానికి భూమన, పార్థసారథి, అబ్బయ్య చౌదరి, జగన్మోహన్ రావు, జక్కంపూడి రాజాలు హాజరయ్యారు.

డేటా చౌర్యంపై ఏర్పాటైన ఈ కమిటీ నివేదికను సిద్ధం చేసింది.ఈ క్రమంలో 85 పేజీలతో అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు.

అయితే, గతంలో రెండుసార్లు సమావేశమైన కమిటీ డేటా చోరీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది.

వైసీపీ నేతల డేటా పలు ఐపీ అడ్రస్‎లకు వెళ్లినట్లు తేల్చింది.