ఆ స్టార్ హీరో శరీరం లాగే మనసు కూడా చాలా తెలుపంటున్న మురుగదాస్...

ప్రస్తుతం ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఇటువంటి చిత్రం దర్బార్ ఈ చిత్రంలో సూపర్స్టార్ రజనీకాంత్ నటించారు.

  రజనీకాంత్ సరసన నయనతార నచటింగా నివేద థామస్, సునీల్ శెట్టి,సిమ్రాన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

  అలాగే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా ప్రముఖ చిత్ర నిణ ర్మాసంస్థ లైక ప్రొడక్షన్స్ నిర్మించారు.

తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు ఏ.ఆర్ మురగదాస్ ఓ ప్రముఖ పత్రిక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 ఇందులో భాగంగా టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా గతంలో తన దర్శకత్వం వచ్చినటువంటి స్పైడర్ చిత్రం అనుకోని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే.

అయితే ఆసమయంలో దర్శకుడు మురగదాస్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. """/"/అటువంటి సమయంలో మహేష్ తనకు ఫోన్ చేసేవాడని అంతేగాక సినిమాలు తీయడం వరకే మన బాధ్యతని ఫలితాలు అభిమానులు నిర్ణయిస్తారని కాబట్టి వాటి గురించి చింతించవద్దని ధైర్యం చెప్పేవాడని అన్నారు.

మాములుగా ప్లాప్ లో ఉన్న దర్శకుడిని ఎవరూ పట్టించుకోరని కానీ మహేష్ అలా కాదని అన్నారు.

మహేశ్ బాబు ఎప్పుడూ తనని ఆప్యాయంగా పలకరిస్తాడని  ఆయన  శరీరం లాగే తన మనసు కూడా చాలా తెలుపని అన్నారు.

తర్వాత దర్భార్ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో కనిపిస్తారని ఈ చిత్రం బాగా వచ్చిందని అన్నారు.

అంతేగాక ప్రతీ ఒక్కరూ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాలని పైరసీని ప్రోత్సహించవద్దని ప్రెకషకులని కోరారు.

ఏపీ కొత్త డీజీపీ ఎంపిక.. సాయంత్రం ఈసీ ప్రకటన..!!