ప్రమాదకరం గా ఉన్న కరెంట్ తీగలు సవరించాలి…

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) రాచర్ల గొల్లపల్లి లో వరి తదితర పంట పొలాల్లో వేసిన విద్యుత్ స్తంభాల పైన ఉన్న విద్యుత్ తీగలు సవరించాలి అని మరియు ఊరిలో ఇంటి ముందు లూస్ లైన్ లు ఇంటి పైనుండి కూడా చేతులకు తగిలేలా వున్నాయని గప్రజలకు ప్రమాదకరంగా వుండని కోరుతూ గొల్లపల్లి బీజేపీ( BJP ) గ్రామ శాఖ ఆధ్వర్యంలో సెస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.

ఇప్పటికీ పలుమార్లు పంట పొలాల్లో కరెంట్ తీగలు(Current Wires ) సవరించాలి అని సెస్ అధికారులకు చెప్పిన వినిపించు కోవడం లేదని ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు సెస్ అధికారులేనని వారు వినతి పత్రం లో పేర్కొన్నారు.

వచ్చే వరి పంట సాగు సమయం వరకు పొలాల్లో వంగి ఉన్న కరెంటు స్తంభాలు సరిచేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో గొల్లపల్లి బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

చికెన్‌లో డ్రగ్స్ దాచి.. భారత సంతతి గ్యాంగ్‌ గుట్టు రట్టు చేసిన యూకే పోలీసులు