రాజ్యాంగ వ్యవస్థకు ప్రమాదం.. కేరళ సీఎం కీలక వ్యాఖ్యలు

రాజ్యాంగ వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు.

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఆయన హాజరైయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పోరాటానికి తమ మద్ధతు ఉంటుందని పినరయి విజయన్ తెలిపారు.

ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలో రాజ్యాంగాన్ని కాపాడేందుకు కేసీఆర్ చేస్తున్న పోరాటానికి మద్ధతు ఇస్తున్నామన్నారు.

ఈ బీఆర్ఎస్ సభ దేశానికి దిక్సూచిలాంటిదని చెప్పారు.రాష్ట్రాల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, దేశంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి ఉందని అన్నారు.

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని తెలిపారు.రాజ్యాంగానికి మోదీ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.

బాబాయ్ హత్యపై అన్నను నిలదీస్తున్న షర్మిల