విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి పొంచి ఉన్న ప్రమాదం

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణం( Nereducharla )లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారి పక్కన విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారి, ప్రజలకు ముప్పు పొంచి ఉందని,స్తంభం ఎప్పుడు కింద పడిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.

ఈ పక్కనే పోలీస్ స్టేషన్, తహశీల్దార్,మండల ప్రజా పరిషత్ తదితర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయని,పక్కనే పంట పొలాలు సైతం ఉండడంతో నిత్యం ఈ రహదారి వెంట ప్రజలు రాకపోకలు సాగిస్తుండడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు .

రోజూ విద్యుత్ అధికారులు( Electricity Authorities ) చూస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి ప్రమాదం సంభవించకముందే,స్తంభానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ ప్రక్షాళన దిశగా రాహుల్ .. సొంత టీం ఏర్పాటు ?