డ్యామిట్ కథ అడ్డం తిరిగింది…!

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది…!

నల్లగొండ జిల్లా:అధికారం ఉంది కదాని అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడిన కొందరు గులాబీ లీడర్ల పరిస్థితి జిల్లాల్లో అగమ్య గోచరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది…!

ఇప్పుడు అధికారం పోయి,వసూళ్ల డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు వెంట పడుతుండడంతో డ్యామిట్ కథ అడ్డం తిరిగిందని పరేషాన్ అవుతున్నారని సమాచారం.

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది…!

గత ప్రభుత్వంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పథకాలు అందేలా చేస్తామని పలువురి నుంచి దళితబంధుకు రూ.

2 లక్షలు,బీసీ బంధుకు రూ.20 నుంచి 30 వేలు, డబుల్‌ బెడ్‌రూం ఇంటికి రూ.

1.50,గృహాలక్ష్మికి రూ.

50 వేల చొప్పున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి.అలాగే కాంట్రాక్టు ప్రాతిపాదికన ఉద్యోగాలు పెట్టిస్తామని కూడా డబ్బులు దండుకున్నట్లు ప్రచారం జరిగింది.

జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులు ప్రదర్శించిన చేతివాటం ఇప్పుడు వారిని ఇరుకున పడేసింది.

ప్రభుత్వం మారడంతో దళితబంధు,బీసీబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, గృహలక్ష్మి వంటి పథకాలకు బ్రేక్ పడింది.

దీంతో ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు.

స్కీం సంగతి అటుంచితే తాము ముట్టజెప్పిన సొమ్మును తిరిగి ఇవ్వాలని వారు బీఆర్ఎస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనితో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది లీడర్ల బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

జిల్లాలో ఇంకా మరికొన్ని ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఆయా పథకాల్లో లబ్ధి చేకూర్చుతామంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు కిందిస్థాయి నేతలు డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

తీరా ప్రభుత్వం మారడంతో చేతులు ఎత్తేశారని,తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ముఖం చాటేస్తున్నారని తెలుస్తోంది.

దీంతో ముడుపులు ముట్టజెప్పిన వారు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

రజినీకాంత్ కి కూలీ సినిమా ఇండస్ట్రీ హిట్ ఇస్తుందా..?