దాదాసాహెబ్ అవార్డు అందుకున్న సీరియల్.. హీరోయిన్ కు కూడా?

రూపాలి గంగూలి మొదట థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈమె ఆ తరువాత స్టార్ ప్లస్ సీరియల్స్ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతే కాకుండా ఈమెకు ఇంస్టాగ్రామ్ లో పది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే బాలీవుడ్ టెలివిజన్ షో లలో అత్యంత ప్రజాదరణ పొందిన షో అనుపమ.

ఈ షో నెలల తరబడి టిఆర్పిని రూల్ చేసింది.అనుపమ సీరియల్ లో రూపాలి గంగూలి లీడ్ రోల్ ను పోషించింది.

కుటుంబం కోసం తన ఆశలు,ఆశయాలు త్యాగం చేసే ఒక మంచి గృహిణిగా,తల్లిగా పేరు తెచ్చుకునే క్యారెక్టర్ లో ఈమె జీవించింది.

ఈ పాత్రలో ఈమె నటించింది అనే బదులు జీవించింది అని చెప్పవచ్చు. """/" / ఈ షో పై ప్రజల్లో అభిమానం ఎంతలా ఉంది అంటే షో లోని పలు పాత్రలు పేరు కొందరి ఇంటి పేరుగా కూడా మారాయి.

రాజన్ షాహి నిర్మించిన ఈ షో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో ఉత్తమ హిందీ సీరియల్ అవార్డు గెలుచుకుంది.

ఈ షోలో మెయిన్ రోల్లో నటించిన ప్రముఖ నటి రూపాలి గంగూలీకి ఉత్తమ ఫిమేల్ అవార్డు లభించింది.

అలాగే మరొక నటుడు సుధాన్షు పాండే అక వనరాజ్ ఉత్తమ మేల్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఒక సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అని చెప్పవచ్చు.

Director Santhossh Jagarlapudi : భగవద్గీత గొప్పతనాన్ని చెప్పే సినిమా చేస్తున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి…