నాన్న సైలెంట్ గా ఉంటారేమో మేము కాదు… రామ్ చరణ్ స్ట్రాంగ్ వార్నింగ్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కొందరికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ నాన్న చాలా క్వైట్‌గా ఉంటారేమో కానీ మేము అలా కాదు.

ఈయన క్వైట్‌గా ఉన్నప్పుడే ఆయన కోసం ఇంత మంది వచ్చారు.ఇక నాన్న గట్టిగా మాట్లాడితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని రాంచరణ్ ఈ సందర్భంగా కొందరిని ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చారు.

"""/"/ ఇక మైత్రి మూవీ మేకర్స్ వారి గురించి మాట్లాడుతూ మరికొందరు నిర్మాతలకు ఈయన వార్నింగ్ కూడా ఇచ్చారు.

మైత్రి మూవీ మేకర్స్ వారితో సినిమాలు చేయడానికి చాలా ఇష్టపడతారని వారిలా ఏ ఇతర నిర్మాతలు సినిమాలు చేయరని చరణ్ తెలిపారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చేసిన హీరోలు అందరికీ మంచి హిట్ సినిమాలను అందించారు.

అయితే మైత్రి వారిని చూసి కొందరు నిర్మాతలు చాలా నేర్చుకోవాలని ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వారి వ్యవహార శైలిని మార్చుకోవాలని వెల్లడించారు.

"""/"/ ఈ విధంగా రామ్ చరణ్ నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడంతో ఆ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఎవరు అని చర్చలు మొదలయ్యాయి.

అదేవిధంగా నాన్న క్వైట్‌గాఉంటారు కానీ మేము అలా కాదు అంటూ చరణ్ ఎవరికి వార్నింగ్ ఇచ్చారనే విషయం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈ వార్నింగ్ రామ్ చరణ్ పరోక్షంగా మంత్రి రోజాకి ఇచ్చినట్టు తెలుస్తుంది.

రోజా గత కొంతకాలంగా మెగా బ్రదర్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ నాగబాబు చిరంజీవి కూడా స్పందించారు.

ఈ క్రమంలోనే రాంచరణ్ కూడా పరోక్షంగా రోజా గారికి వార్నింగ్ ఇచ్చారని పలువురు భావిస్తున్నారు.

నా సినిమాకే పోటీనా అంటూ ఆ డైరెక్టర్ కు చరణ్ వార్నింగ్.. చివరికి ఏమైందంటే?