ఈనెల 15 నుంచి 17 వరకు సీడబ్ల్యూసీ సమావేశాలు..: భట్టి

ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.సోనియా గాంధీ చారిత్రక డిక్లరేషన్ ను ప్రకటిస్తారని భట్టి పేర్కొన్నారు.

ఈ నెల 17న హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.హైదరాబాద్ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.కొద్ది మంది బీఆర్ఎస్ నేతల చేతుల్లో సంపద చేరిపోయిందని ఆరోపించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అవినీతిపై ఛార్జ్ షీట్ ప్రకటిస్తామని తెలిపారు.ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని వెల్లడించారు.

బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకే వెళ్తుందని విమర్శలు చేశారు.

ఆ రెండు పనులు చేసి రాజమౌళికి కోపం తెప్పించిన అల్లు అరవింద్.. ఏవంటే..?