ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన నిందితుల కస్టడీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల కస్టడీ ముగిసింది.

కేసులో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ లతో పాటు అభిషేక్ బోయినపల్లిల ఈడీ కస్టడీ ముగిసింది.

ఈ మేరకు నిందితులను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు.నవంబర్ 10న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అదేవిధంగా సెప్టెంబర్ 27న విజయ్ నాయర్, అక్టోబర్ 10న అభిషేక్ బోయినపల్లిలను అదుపులోకి తీసుకున్నారు.

నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ పై ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది.సౌత్ గ్రూప్ లావాదేవీల్లో నిందితులు కీలక వ్యక్తులుగా ఉన్నారు.

జగన్, కేసీఆర్ ఓడిపోయినా వాళ్లకు మంచి రోజులొస్తాయి.. వేణుస్వామి కామెంట్స్ వైరల్!