కొరుకుతూ, కొడుతూ, గొంతు పిసుకుతూ పిల్లోడిని హింసించిన తల్లి.. వీడియో వైరల్..

తాజాగా హరిద్వార్‌లోని( Haridwar ) రూర్కీలో( Roorkee ) ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.

దీనికి సంబంధించిన ఒక భయంకరమైన వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఒక తల్లి( Mother ) తన ఎనిమిది ఏళ్ల కొడుకును చంపే ప్రయత్నం చేస్తోంది.

ఆమె బిడ్డను చాలా దారుణంగా కొట్టింది, కొరికింది, గొంతు పిసికింది.ఈ ఘటన కెమెరాలో రికార్డు అయింది.

వీడియోలో ఆ తల్లి పిల్లవాడి మీద కూర్చుని, అతని తలను నేల మీద బాదుతున్న షాకింగ్ విజువల్స్ చూడవచ్చు.

ఉన్నాయి.పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ వ్యక్తి ఈ ఘటనను మొబైల్‌తో రికార్డు చేసి ఆ వీడియోను బుధవారం సోషల్ మీడియాలో పెట్టాడు.

వీడియోలో కనిపించే పిల్లోడిని చాలా దారుణంగా కొడుతున్నది ఆ కొడుకు తల్లే అని తెలుస్తోంది.

"""/" / ఆ మహిళ పిల్లవాడిని నేలపై పడేసి అతడి పై కూర్చుని కొట్టడం వైరల్ వీడియోలో చూడవచ్చు.

వీపుపై కొడుతుంటే ఆ బాధ భరించలేక కుమారుడు( Son ) నొప్పితో అరుస్తూ కనిపించాడు.

ఆ తర్వాత, ఆ మహిళ చిన్నోడు అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని నేలకేసి బాదింది.

అంతేకాదు ఈ కిరాతక తల్లి వీడియో తీస్తున్న వ్యక్తిపై కేకలు వేస్తూ షూటింగ్ కంటిన్యూ చేయమని ఆర్డర్ చేసింది.

విడిచిపెట్టమని ఎంత వేడుకున్నా సదరు మహిళలో జాలి కలగలేదు.ఆహం వేస్తుంది నీళ్లు ఇవ్వమని అడిగినా కూడా ఆమె వినిపించుకోలేదు.

"మమ్మీ, ముందు నాకు నీళ్లు ఇవ్వు" అని బాలుడు అరవడం మనం వినవచ్చు.

అదేమీ పట్టించుకోకుండా ఆమె పిల్లోడి ముఖంపై చెంప దెబ్బలు బలంగా కొట్టింది.ఛాతీపై బలంగా కొరికింది.

"""/" / 90 కిలోల బరువున్న ఆమె పాతిక కిలోల బరువున్న పిల్లోడిపై కూర్చొని మెడ పిసుకుతూ అతడిని చంపేటట్లు పైకి వచ్చింది.

పిల్లోడు చచ్చిపోతాడు అని వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి అనేసరికి ఆమె అతడి మెడ వదిలేసింది.

కానీ కొట్టడం, గుద్దడం కంటిన్యూ చేసింది.తన్నుతూ పెట్టాల్సిన చిత్ర హింసలన్నీ పెట్టింది.

ఈమె తల్లా లేకపోతే రాక్షసి హా అని అనుకునే లాగా కిరాతకంగా ప్రవర్తించింది.

వీడియో చూసిన నెటిజన్లు "ఇలాంటి తల్లులకు కఠిన శిక్ష విధించాలని, వీరిని త్వరగా శిక్షించకపోతే వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంద"ని కామెంట్లు చేస్తున్నారు.

ఆ ఒక్క పని చేస్తే మాత్రమే పూరీ జగన్నాథ్ కు హిట్లు.. మారాల్సిన తరుణం ఆసన్నమైందా?