సూర్యాపేట జిల్లా: కోదాడ మండలంలోని పలు గ్రామాల్లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద రైతులు వేసిన వరి పంట చేతికి వచ్చేసరికి నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది.
బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయేసరికి రైతులు చేసేదేమీలేక పంటపై ఆశలు వదులుకొని పశువులను మేపుతున్నారు.
సాగర్ నుండి ఒక తడి నీరు విడుదల చేస్తే కొంత మేరకు పంటలను కాపాడే అవకాశం ఉంటుందని,ఒక పది రోజులు నీళ్ళు విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కళ్యాణ్ రామ్ గత జన్మలో నా బిడ్డేనేమో అనిపిస్తుంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్ వైరల్!