తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే, మంత్రి ఆర్కే సింగ్..

ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే, కేంద్ర విద్యుత్తు మరియు పునరుత్పాదక విద్యుత్తు శాఖ సహాయ మంత్రివర్యులు ఆర్కే సింగ్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు.

వారికి ఆలయ అధికారులు మహద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.

"""/"/ దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.

ఆలయం వెలుపల అనిల్ కుంబ్లే తో ఫోటో దిగడానికి భక్తులు అభిమానులు ఎగబడ్డారు.

‘‘ మీ వెనుక ఖలిస్తాన్ జెండాలు ఎందుకున్నాయి ’’.. వివాదంలో భారత సంతతి మహిళా నేత