అంచనాలు పెంచుతున్న కన్నడ పాన్ ఇండియా మల్టీ స్టారర్

ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్, పాన్ ఇండియా సినిమాలు సౌత్ లో కామన్ అయిపోయాయి.

దర్శకులు యూనివర్శల్ కథలతో హీరోలని మెప్పిస్తూ పాన్ ఇండియా రేంజ్ సినిమాలని చేస్తున్నారు.

రాజమౌళి చూపించిన మార్గంలో మిగిలిన దర్శకులు, స్టార్ హీరోలు ముందుకి వెళ్తున్నారు.బాహుబలి తర్వాత, కేజీఎఫ్, సాహో సినిమాలతో పాన్ ఇండియా అప్పీల్ సౌత్ సినిమాలకి ఉపయోగపడుతుంది.

నార్త్ ప్రేక్షకులు కూడా సౌత్ కథలని హిందీలో చూడటానికి ఇష్టపడుతున్నారు.దీంతో మన దర్శకులు కూడా డేర్ చేస్తున్నారు.

ఇక కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ లో అందరిని అలరించాడు.

ఇప్పుడు అదే దారిలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కూడా వెళ్తున్నారు.ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు సౌత్ ప్రేక్షకులకి చేరువ అయ్యారు.

అలాగే కిచ్చా సుదీప్ అయితే హిందీ సినిమాలలో కూడా అలరిస్తున్నాడు.ఈ నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ కబ్జాకి భారీ హైప్ వస్తుంది.

ఆర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పీరియాడికల్ జోనర్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో నడుస్తుంది.

19౪౭ నుంచి 1984 వరకు ఈ సినిమా కథ ట్రావెల్ ఉంటుందని తెలుస్తుంది.

"""/"/ ఇక ఉపేంద్ర, సుదీప్ ఇద్దరూ మూవీలో గ్యాంగ్ స్టార్స్ గా కనిపిస్తారని టాక్.

ఇక లగడపాటి శ్రీధర్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక మూవీలో నయనతార, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

మరో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఎంత వరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి.

విజయ్ దేవరకొండ నానిలలో నంబర్ వన్ ఎవరు.. ఆ సర్వేతో పూర్తి క్లారిటీ .!