నల్ల సముద్రంపై తారక్ యాక్షన్ సీన్స్.. ప్రశాంత్ నీల్ మూవీ వేరే లెవెల్ అంటూ?

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( NTR, Prashant Neel ) కాంబో మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి కాగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 350 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది.

ఈ సినిమాలో కూడా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని సమాచారం.తారక్ ప్రశాంత్ కాంబో మూవీ వేరే లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.

"""/" / ఐరోపాలో ఉన్న నల్ల సముద్రంపై ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను( Action Scenes ) షూట్ చేయనున్నారని ఆ సన్నివేశాలకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం పక్కా అని సమాచారం.

తారక్ ప్రశాంత్ కాంబో మూవీ షూట్ విదేశాల్లో జరగనుందని గతంలో వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలే నిజం కానున్నాయని క్లారిటీ వచ్చేసింది.

సాధారణంగా నల్ల సముద్రంపై యాక్షన్ సీన్స్ షూట్ చేయడం ఒకింత రిస్క్ అని తెలుస్తోంది.

"""/" / అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమాకు బెస్ట్ ఔట్ పుట్ కోసం కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో సైతం నటించడానికి సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఇండియా వరకు బాక్సాఫీస్ వద్ద షేక్ చేయగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో పాన్ వరల్డ్ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ షూట్ ఈ ఏడాదే మొదలుకానుండగా 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

ఎన్టీఆర్ పారితోషికం సైతం అంతకంతకూ పెరుగుతుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోని క్రేజీ ప్రాజెక్ట్ లలో ఈ సినిమా ఒకటని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

రామ్ చరణ్ సినిమాలో ఆ స్టార్ నటుడు నటించబోతున్నాడా..?