వైసిపి మంత్రి పై మండిపడ్డ సిపిఐ నారాయణ..!!

వైసిపి పార్టీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న ఏపీ రాజధాని విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని.అక్కడే సెక్రటరియేట్.

అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది పులివెందల అయినా లేకపోతే విజయవాడ అయినా మరి ఏ చోట అయినా.

ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నారాయణ సీరియస్ కౌంటర్లు వేశారు.

అటువంటప్పుడు ఎన్నికలు ఎందుకు.? ప్రమాణ స్వీకారం చేయడం ఎందుకు.

? ముఖ్యమంత్రి కార్యాలయం ఒకటి ఉండాలి కదా., సచివాలయం ఉండాలి కదా, న్యాయవ్యవస్థ ఉండాలి కదా.

ఈ మూడు లేకుండా ముఖ్యమంత్రి ఉంటాడా అంటూ సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ మంత్రి రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగకి వ్యతిరేకంగా ఉన్నట్లు.ఆ హక్కు ఎవరు ఆయనకి ఇచ్చారు అని సిపిఐ నారాయణ నిలదీశారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?