ఏపీ మంత్రి బొత్సకు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సవాల్

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సవాల్ విసిరారు.

రాజధాని రైతుల పాదయాత్ర ఆపేందుకు ఐదు నిమిషాల సమయం పట్టదన్న బొత్స వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దమ్ముంటే పాదయాత్రను అడ్డుకోవాలని సవాల్ విసిరారు.హైకోర్టు ఉత్తర్వులు మేరకు అమరావతి పాదయాత్ర జరుగుతుందన్న విషయాన్ని వైసీపీ నాయకులంతా గుర్తుపెట్టుకోవాలన్నారు.

వైసీపీ నాయకులు మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్నారనన్న ఆయన.పాదయాత్రకు బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

Hair Coffee Mask : రెండు స్పూన్ల కాఫీ పొడితో ఇలా చేశారంటే రెండు నెలల్లో మీ జుట్టు రెండింతలు అవ్వడం ఖాయం!