ఏసీబీ వలలో చిక్కుకున్న అవినీతి అధికారులు
TeluguStop.com
లంచాలు తీసుకుం టూ గురువారం ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు.యాదాద్రి జిల్లా భువన గిరి మండలం అనాజీపురంలో ఎరువు లు, విత్తనాల దుకాణం ఏర్పాటు కోసం వేముల విజయ్, రాజు వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్రెడ్డిని ఆశ్రయిం చారు.
రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేయగా, మొదటి విడతగా రూ.
లక్ష నగదు తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డాడు.ఖమ్మం జిల్లా ట్రాన్స్కో కార్యా లయ పరిధిలో గతేడాది సురేశ్బాబు అనే కాంట్రాక్టర్ పలు పనులు చేశారు.
సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేసిన రూ.96 వేలు తిరిగి ఇవ్వాలని ఏడీఈ గుగులోత్ ఈర్యా, ఏఈ రనిల్ను సంప్ర దించగా డబ్బులు డిమాండ్ చేశారు.
గురువారం వారు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
పవన్ వ్యక్తిత్వం పై అనసూయ సంచలన వ్యాఖ్యలు… అలాంటి మనస్తత్వం అంటూ?