భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
TeluguStop.com
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.తాజాగా 7,946 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762 కు చేరిందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు కరోనా నుంచి 4,38,45,680 మంది కోలుకోగా.5,27,911 మంది మృత్యువాత పడ్డారు.
ప్రస్తుతం దేశంలో 62,748 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
గడిచిన 24 గంటల్లో 9,828 మంది కరోనా నుంచి బయటపడగా, మరో 37 మంది చనిపోయారని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. జయం రవి భార్య కామెంట్స్ వైరల్!