భార‌త్ లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

భార‌త్ లో క‌రోనా కేసులు మళ్లీ క్ర‌మంగా పెరుగుతున్నాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో 6,422 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు.

అదే స‌మ‌యంలో 5,748 మంది క‌రోనా నుంచి కోలుకోగా.14 మంది క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు.

తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 4,45,16,479కి చేరుకుంది.దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 5,28,250 మంది మృత్యువాత ప‌డ్డార‌ని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ప్ర‌స్తుతం దేశంలో 46,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి.అదేవిధంగా దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.

04 శాతంగా, క్రియాశీల రేటు 0.10 శాతంగా ఉందని పేర్కొన్నారు.

రిక‌వరీ రేటు 98.71 శాతం, మ‌ర‌ణాల రేటు 1.

19 శాతంగా ఉంద‌ని హెల్త్ బులెటిన్ లో స్ప‌ష్టం చేశారు.

ఆ కారణం వల్లే అమ్మ చనిపోయింది.. సూర్యకాంతం కొడుకు షాకింగ్ కామెంట్స్ వైరల్!