కాంట్రావర్సీలు కామన్... నాకు వాటికీ సంబంధం లేదు.. కంగానా కామెంట్స్ వైరల్?
TeluguStop.com
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు.
ఇకపోతే తాజాగా ఈమె దేశ స్వాతంత్రం గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి.
దేశానికి అసలైన స్వాతంత్రం 2014లో వచ్చిందంటూ కంగనా చేసిన వ్యాఖ్యలపై ఎంతోమంది ఘాటు విమర్శలు చేశారు.
గత రెండు రోజుల క్రితం ఈ విధమైనటువంటి కాంట్రవర్సీలు ఎదుర్కొన్న కంగనా రనౌత్ నాకు కాంట్రవర్సికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది.
తాజాగా కంగనా రనౌత్ నటించిన తేజస్ అనే సినిమా ముగింపు వేడుకలలో పాల్గొంటూ ఎంతో హంగామ చేసింది.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కంగనా ఈ ఫోటోలను షేర్ చేస్తూ.'నా తలలో ఒక పాట మోగుతోంది .
మేరే మెహబూబ్ తుజే మేరీ మొహబ్బత్ కి కసమ్' అంటూ రాసుకొచ్చింది.ఈ క్రమంలోనే కంగనా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్ ఒకరు 'క్యా ముఝే ప్యార్ హై యాఆఆఆ!!' అంటే మరొకరు మీ అందం సరికొత్త ఫ్యాషన్ను క్రియేట్ చేస్తుంది' అంటూ కామెంట్ చేశారు.
ఇక తేజస్ చిత్రాన్ని బాలీవుడ్ రైటర్, డైరెక్టర్ సర్వేష్ మేహరా దర్శకత్వం వహిస్తుండగా.
రోనీ స్రూవాలా బ్యానర్పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా కంగన తన సోదరితో కలిసి డాన్స్ చేయడం అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.