బీసీలకు కాంగ్రెస్ 34 సీట్లు ఇవ్వాలి: కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర నేత తండు శ్రీనివాస్ యాదవ్

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో బీసీలకు టిక్కెట్ లు ఇవ్వలేదని,పలు జిల్లాలలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తున్నారని, మొదటినుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అసలు సిసలైన కాంగ్రెస్ వాదులకు టిక్కెట్లు ఇవ్వాలన్నారు.

బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో కనీసం 34 టిక్కెట్లు ఇవ్వాలని,లేనిపక్షంలో పార్టీకి బీసీ సమాజం దూరమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ నాయకులు బెంజారపు రమేష్,పంత నర్సయ్య,గుంటి సైదులు ముదిరాజ్,బీసీ నాయకులు పాల్గొన్నారు.

భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్.. ఆమె నుంచి ప్రేమ ఉండదంటూ?