రేపు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ కానుంది.ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

సమావేశంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేయనుంది.

మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు నేతలు.మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో టీపీసీసీ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోందని సమాచారం.

పెదాల పగుళ్ల నుంచి మొటిమల నివారణ వరకు తేనెతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా..?