భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞత ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగింది.

స్థానిక మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట పాత అంగడి బజార్ నుండి ర్యాలీగా డీజే చప్పుళ్లతో, మహిళల బతుకమ్మ ఆటలతో పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు.

అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని , సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుంచేందుకు కృషి చేస్తామని అన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనదని, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అధికారంలోకి తీసుకురావడానికికృషిచేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు,కృతజ్ఞతలు తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలు అమలుపరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, సూడిది రాజేందర్,సోషల్ మీడియా కన్వీనర్ బీపేట రాజకుమార్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గంట బుచ్చయ్య గౌడ్, సిరిపురం మహేందర్,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్,సద్ది రమేష్,దండు శ్రీనివాస్, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవికి తెగ నచ్చేసిన నాని ఫ్లాప్ సినిమా… అంతలా ఏం నచ్చిందబ్బా?