గాలిపెల్లి హాస్టల్ లో పాము కాటు గురై చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆసుపత్రి వద్ద ఉన్న వార్డెన్ గంగయ్య ను పాముకాటు గురించి అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పెళ్లి బీసీ హాస్టల్ లో శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు హాస్టల్ రూమ్ లో పడుకుని ఉన్న రామావత్ రోహిత్ అనే ఆరవ తరగతి విద్యార్థికి పాము కాటేయడం తో అతడిని హాస్టల్ వార్డెన్ సిబ్బంది కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ లో చికిత్స కోసం తరలించారు.

హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి నాయకులు బండారి బాల్ రెడ్డి , గుండాడి రామిరెడ్డి లు శుక్రవారం ఏడు గంటల ప్రాంతంలో హాస్పిటల్ కు వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

అక్కడే ఉన్నా వార్డెన్ గంగయ్యను పాముకాటు గురించి అడిగి తెలుసుకున్నారు.అక్కడే ఉన్న రోహిత్ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను ఓదార్చారు.

బాల్యంలోనే తండ్రి వదిలేసినా టెన్త్ లో టాపర్.. శ్రీజ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!