గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట బిజెపి పార్టీ తీరుకు నిరసనగా కాంగ్రెస్ కమిటీ శుక్రవారం ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య గాంధీ విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడారు.

బిజెపి ప్రభుత్వానికి చెందిన లలిత మోడీ,నీరవ్ మోడీ బ్యాంకులను కొల్లగొట్టడం జరిగిందన్నారు,అదే తరహాలో ప్రధానమంత్రి మోడీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడినందుకు కోర్టు శిక్ష విధించడం అన్యాయమన్నారు.

రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రకు ప్రజల ఆదరాభిమానాలు చూడలేక బిజెపి పార్టీ ఇలా చేస్తుందన్నారు.

నరేంద్ర మోడీ నియంతృత్వ విధానాన్ని అంతం చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ధి లక్ష్మారెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ భానోతు రాజు నాయక్, నాయకులు గుండాడి రాంరెడ్డి,కొత్తపల్లి దేవయ్య శెట్టిపల్లి బాలయ్య, ఇమామ్, మామిళ్ళ కిషన్, గంగన్న, రమేష్,లక్ష్మణ్,సంతోష్ గౌడ్, తిరుపతి రెడ్డి, చెన్ని బాబు, గండికోట రవి,బాపురెడ్డి, చెరుకు ఎల్లయ్య, మహేందర్ , శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అలాంటి విషయాలు బయటకు చెప్పను.. లావణ్యతో ప్రేమపై వరుణ్ రియాక్షన్ ఇదే!