కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు..: మంత్రి పువ్వాడ

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది.

ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

ఈ మేరకు ఖమ్మంలోని 4, 5 మరియు 6వ డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని తెలిపారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంతో పాటు ఖమ్మం అభివృద్ధిలో మరింత ముందుకు పోవాలంటే తనను గెలిపించాలని కోరారు.

అనంతరం కాంగ్రెస్ పై మంత్రి పువ్వాడ విమర్శలు చేశారు.కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని, అలాంటిది వాళ్లు ప్రజలకు ఏం గ్యారెంటీలు ఇస్తారని ఎద్దేవా చేశారు.

అమెరికాలో మొదలైన అధ్యక్ష ఎన్నికల ఓటింగ్.. భారతీయులు ఈసారి ఏవైపు?