ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కార్డులు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కార్డులను సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అందజేశారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆటో, కారు ,ట్రాక్టర్ల డ్రైవర్ల కోసం ఈ ఇన్సూరెన్స్ పథకం కింద ప్రమాదం జరిగితే 5 లక్షలు వస్తాయన్నారు.

కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేస్తుందన్నారు.ఇన్సూరెన్స్ కార్డుల కోసం మొత్తం డబ్బును ఇన్సూరెన్స్ సంస్థకు చెల్లించానన్నారు.

ఈ ఇన్సూరెన్స్ కార్డులను తెలంగాణ సేవ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ అదేవిధంగా అఖిలభారత అసంగటిత, కార్మికుల సంఘటిత కాంగ్రెస్ సంఘం తయారుచేసి ఇవ్వడం జరిగిందన్నారు.

భవిష్యత్తులో డ్రైవర్లకు ప్రమాదవశాత్తు ఎవరు ఇబ్బందులకు గురైన ఈ ఇన్సూరెన్స్ కార్డు ఒక వరంలాగా పనిచేస్తుందని సూచించారు.

ఇంక కొత్తగా ఇన్సూరెన్స్ కావలసినవారు మా నాయకులను సంప్రదిస్తే వారికి కూడా ఇన్సూరెన్స్ కార్డులను తామే డబ్బులు చెల్లించి ఉచితంగా అందజేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కేకేసి ప్రధాన కార్యదర్శి సింగిలి సంపత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె సుధాకర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సుధాకర్, ఉపాధ్యక్షులు మెట్టు రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు దొమ్మాటి నరసయ్య ,పందిర్ల లింగం గౌడ్,మర్రి శ్రీనివాస్ రెడ్డి, చెన్నిబాబు, అనవేని రవి ,ఎండి రఫీక్, భానొతు రాజు నాయక్, రాజేందర్, రాంరెడ్డి, చెరుకు ఎల్లయ్య, పరశురాములు, మహేందర్, బుచ్చా గౌడ్, తిరుపతిరెడ్డి, భూమిరెడ్డి,బాలయ్య, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

తప్పు ఎవరు చేసిన అప్పుడు ఇప్పుడు బలయ్యింది సమంత నే కదా !