రాజస్థాన్ సీఎంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్తి

రాజస్థాన్ సీఎం అశోక గెహ్లాట్ పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.పార్టీ కార్యాలయం బేరర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పీసీసీ చీఫ్ లు కానీ ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనకూడదని చెప్పారు.

అదేవిధంగా మద్దతు ప్రకటించకూడదని తెలిపారు.కానీ మల్లికార్జున ఖర్గేకు గెహ్లాట్ బహిరంగంగా మద్దతును తెలిపారని శశిథరూర్ వెల్లడించారు.

దీనిపై కాంగ్రెస్ ఎన్నికల అధికార యంత్రాంగం దర్యాప్తు చేయాలని కోరారు.

రోలెక్స్ పాత్ర గురించి షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన సూర్య.. అంచనాలు పెంచాడుగా!